Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమెరికా దిష్టిబొమ్మ దగ్ధం

అమెరికా దిష్టిబొమ్మ దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : అమెరికా సామ్రాజ్యవాదం యొక్క అండతో ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం ధర్నా చౌక్ లో అమెరికా ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో పేదరికం, దారిద్రం, నిరుద్యోగం పెరుగుతుంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం పచ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తూ తమ ఆయుధాలను అమ్మకం ద్వారా లబ్ధి పొందాలని కుట్రతో ఇజ్రాయిల్ ను ప్రోత్సహిస్తూ ఇరాన్ పైన దాడులను తమ డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్నారని ఇప్పటికే పాలస్తీనా తదితర ప్రాంతాల్లో సుమారు 56,000 మందికి పైగా అమాయకపు ప్రజలు పసిపిల్లలు ప్రాణాలను తీశారని. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నదని, అందుకు ఇరాన్ అధ్యక్షుడిని హతమార్చడానికైనా సిద్ధపడుతున్నదని ఫలితంగా దేశం పైన ఇజ్రాయిల్ తో దాడులు చేస్తూ అమాయకులను బలిగొంటున్నారని దీని మూలంగా దీని మూలంగా ప్రపంచంలో మారణ హోమం పెరిగి ప్రజలు మరింత గత 20 నెలలుగా ఇజ్రాయిల్ పాలస్తీనా లోని గాజా తదితర ప్రాంతాల్లో దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొందన సహకారంతో ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించి మానవ హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. ఈ దురంకార మారణ హోమాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు భారత ప్రభుత్వం పాలస్తీనా సంఘీభావం ప్రకటించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని అమెరికా సామ్రాజ్యవాద తత్వాన్ని ఖండించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, నాయకులు సుజాత, విగ్నేష్, సిపిఐ జిల్లా నాయకులు ఓమయ్య,నర్సింగ్ రావు, రంజిత్, రాదా కుమార్, సాయిలు, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్, భూమయ్య, మోహన్, మల్లేష్, శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు, రవికుమార్, గణేష్, కిరణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -