Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పోలీస్ స్టేషన్ లో బైటాయించిన బీఆర్ఎస్ నాయకులు 

పోలీస్ స్టేషన్ లో బైటాయించిన బీఆర్ఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – మంచిర్యాల : జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు దగ్గుల మధుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో బైటయించి నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజక వర్గ బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చెపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యం చేసుకున్నా.. నాయకులు నిరసన కార్యక్రమాన్ని విరమించలేదు. నిందితులను అరెస్ట్ చేసినకే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతాం అంటూ నాయకులు తెలపడంతో దాదాపు గంట సేపటి నుంచి నిరసన కొనసాగుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad