జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇండ్లకి సంబంధించి గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు హౌసింగ్ అధికారులతో వెబెక్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి పునాది నిర్మాణo,గోడల నిర్మాణం, స్లాబ్ , ఇల్లు పూర్తిగా నిర్మాణం పూర్తి అవ్వగానే నాలుగు దశలలో ఎప్పటికప్పుడు ప్రతి వారం హౌసింగ్ ఎ ఈ లు ఫోటో కాప్చర్ చేసి రిపోర్ట్ హౌసింగ్ పి డి కి పంపిస్తే ప్రతి శనివారం రోజు రాష్ట్ర స్థాయి అధికారులకి ఇండ్ల నిర్మాణానికి సంబందించిన చెల్లింపులు కొరకు పంపటం జరుగుతుందని ప్రతి సోమవారం లబ్దిదారుల అకౌంట్ లో అమౌంట్ చెల్లింపులు చేయటం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ఏమైనా టెక్నీకల్ సమస్యలు, లబ్ధిదారుల పేర్లు,బ్యాంకు అకౌంట్ నెంబర్ లో తప్పులు,ఏమైణా ఉంటే ప్రజలకి ఇబ్బంది కల్గించకుండా అధికారులు సరిచేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమం లో హౌసింగ్ పిడి ధర్మారెడ్డి, హౌసింగ్ డిప్యూటీ డి ఈ జబ్బార్,హౌసింగ్ ఎ ఈ లు,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పైలెట్ ప్రాజెక్టుకు ఎంపికైన ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES