- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని కోటార్మూరు గ్రామస్తులు, గ్రామ విడిసి ప్రతినిధుల ఆధ్వర్యంలో శుక్రవారం తహసిల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ పంట పొలాలకు వెళ్లే మార్గంలో కందకం కొట్టినారని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కందకమును తొలగించి రైతులకు, గ్రామ ప్రజలకు ఈ మార్గమును మునుపటిలాగా ఉంచి ఇబ్బందులను తొలగించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -