నవతెలంగాణ – జన్నారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపల్ బండి రాములును రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన, సూర్యరేఖ ఈ న్యూస్ రిపోర్టర్ జమీర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. వివరాల్లోకెళ్తే.. ఈనెల 16న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కాలేజ్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో జన్నారంకి చెందిన సూర్య రేఖ ఈ న్యూస్ రిపోర్టర్ జమీర్ ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ కి వెళ్లి నేను సూర్యరేఖ ఈ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అని చెప్పి, తనకి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ప్రిన్సిపల్ ఎందుకు ఇవ్వాలి అని వాదించారు. అదే విషయం మనసులో పెట్టుకొని నువ్వు ఇక్కడ ఎలా డ్యూటీ చేస్తావో నేను కూడా చూస్తా అని అంటూ బెదిరిస్తూ.. నీపై పేపర్లో కథనాలు ప్రచురిస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ .. సూర్య రేఖ ఈ న్యూస్ పేపర్ లో తనపై తప్పుడు కథనాలు ప్రచురించినాడు. తన విధులకు ఆటంకం కల్పించినాడు. అని ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపల్ బండి రాములు ఇచ్చిన పిర్యాదు మేరకు జర్నలిస్టు అయినా జమీర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనూష తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణలని అవాస్తవాలు: ప్రిన్సిపల్ రాములు
తనపై సూర్య రేఖ ఈ న్యూస్ రిపోర్టర్ జమీన్ రాసిన వార్తలు, సోషల్ మీడియాలో చేసినవన్నీ అసత్యాలని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు అన్నారు. తనను రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఇవ్వనందుకే తనను బ్లాక్ మెయిల్ చేశాడన్నారు. నా విధి నిర్వహణ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ నా పనులను నేను చేసుకుంటున్నాను అన్నారు. గత 13 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఎక్కడ కూడా తనపై రిమార్కు లేదన్నారు. తన విధి నిర్వహణలో తను ఎలాంటి తప్పులు చేయలేదన్నారు.