నవతెలంగాణ – ఢిల్లీ : పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయనివారి పాన్ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. దీన్ని 2024 మే 31లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. లేనిపక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.