Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు లక్ష్యంతో ఉన్నత చదువులు చదవాలి..

విద్యార్థులు లక్ష్యంతో ఉన్నత చదువులు చదవాలి..

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులు ఒక ఉన్నతమైన లక్ష్యంతో చదివి ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని ఏ స్క్వేర్ ప్రతినిధి శ్రీలక్ష్మి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని విద్యార్థులు అనేక ధైర్య సాహసాలతో ఉంటారని పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులలో అనేక నైపుణ్యాలు దాగి ఉంటాయని అన్నారు. ఆ నైపుణ్యాలను వెలికి తీసేందుకు తమ వంతు కెరీర్ గైడెన్స్ అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే మీ పాఠశాలను సందర్శించి మీకు కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం  నైపుణ్యాలను వెలికి తీసేందుకు తమ వంతు కృషి చేస్తామని వివరించారు. ఇప్పటినుంచే లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు అందించుటకు తమ వంతు కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ స్క్వేర్ గ్రూప్ ప్రతినిధులు చైతన్య, హర్ష ,విశాల్ రాజ్, అఖిల్ , చైతన్య తోపాటు మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, నాయకులు ఆలేటి జయపాల్ రెడ్డి, తో పాటు ఉపాధ్యాయులు శంకర్ ,రజిత, లక్ష్మయ్య, స్వామి, వనిత, స్రవంత్, తో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొట్టే మల్లికాంబ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -