Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబండి సంజయ్‌కి త్వరలో సిట్‌ నోటీసులు!

బండి సంజయ్‌కి త్వరలో సిట్‌ నోటీసులు!

- Advertisement -

– కేంద్ర మంత్రికి ఫోన్‌ చేసిన అధికారులు
– వాంగ్మూలం కోసం సమయమివ్వండి
– షెడ్యూల్‌ చూసుకుని టైం చెబుతానన్న కేంద్రమంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి త్వరలో సిట్‌ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో వాంగ్మూలం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు కేంద్ర మంత్రికి శుక్రవారం ఫోన్‌ చేసి కోరారు. ఆయన ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందని వెల్లడించారు. విచారణకు సిద్ధంగా ఉండాలని కోరారు. షెడ్యూల్‌ చూసుకుని టైం ఇస్తానని మంత్రి బండి సంజయ్‌ పోలీసులకు తెలిపారు. ఈ అంశంపై ఆయనకు ఒకటెండ్రు రోజుల్లో సిట్‌ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తెచ్చింది బండి సంజరునే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సంగతి తెలిసిందే. తనతో పాటు బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ పలుమార్లు బండి సంజరు అప్పట్లోనే ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని పలుమార్లు పేర్కొన్న విషయం విదితమే. ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్‌ ఏం వాంగ్మూలం ఇస్తారనే దానిప్తె ఆస్తకి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -