నవతెలంగాణ – అమరావతి: ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం ఎదురు కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ లేఖను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు పంపించారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వైసీపీ సింగిల్ డిజిట్కు పరిమితమైన విషయం తెలిసిందే.