- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర : లండన్ అక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ కార్యక్రమానికీ హాజరైన బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ను శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి కలిశారు. ఈ సందర్బంగా కేటీఆర్తో కలిసి “ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా” అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగించిన కేటీఆర్ తో చర్చించారు. అనంతరం కేటీఆర్ కు పూల బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోసామల అజయ్ రెడ్డి,నల్గొండ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ రెగట్టె మల్లిఖార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -