అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..
విచారణ జరపాలని డిమాండ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్ : కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం దుర్కి గిరిజన గురుకుల పాఠశాల, కాలేజ్ లో తాత్కాలిక లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మామిడి స్వప్న (35) అనే లెక్చరర్ అనుమానాస్పద మృతి చర్చనీయాంశమైంది. పోలీసుల, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన మామిడి స్వప్న అనే మహిళ నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామాల్లో ఉన్న గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం సప్న టెట్ పరీక్ష కోసం కోదాడ వెళ్లి పరీక్ష రాసి తిరిగి నిన్న వీధిలో చేరారు. శుక్రవారం రాత్రి 200 మంది విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థినీలతో నిద్రపోయారు. నేడు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తెల్లవారుజామున లేసినప్పటికీ లెక్చరర్ లేవకపోవడంతో స్వప్నను కదిలించి చూశారు. అప్పటికే కదిలికలు లేకపోవడంతో వెంటనే ప్రిన్సిపల్ కు సమాచారం అందించారు. విద్యార్థులు, సిబ్బంది బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్వప్న అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. మామిడి సప్న గత ఐదు సంవత్సరాలుగా లెక్చరర్ విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం దుర్గి గిరిజన జూనియర్ కళాశాలకు బదిలీపై వచ్చారు. లెక్చరర్ ఆకస్మికంగా మృతి చెందడంతో బాన్సువాడలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. లెక్చర్ మృతి చెందడంతో తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానికులు బాన్సువాడ ఆస్పత్రికి తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ నాయక్ బాన్సువాడకు తరలివచ్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ పోలీసులు అధికారులు మృతురా నీ కుటుంబ సభ్యులు వచ్చి స్వప్న మృతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వప్న మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని తల్లి రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవ పంచదామ నిర్వహించారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు.