కోట్లతో ఉడాయించిన మోసగాడు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
నవతెలంగాణ – మిర్యాలగూడ : చిట్టిల పేరుతో అమాయక జనం నుండి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన కేటుగాడు వారికి శఠగోపం పెట్టి పరారైన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కటకం సైదిరెడ్డి గత 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారం, చిట్టిల పేరుతో ప్రజలను నమ్మించాడు. 45 మంది బాధితుల నుండి చిట్టిల పేరుతో రూ.1.50 కోట్లు కాజేసి గుట్టు చప్పుడు కాకుండా కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. సోమవారం అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా ఇంకా ఫిర్యాదు చేయని అనేక మంది బాధితులున్నారని, మొత్తంగా సుమారు రూ.4 కోట్లు కాజేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసుల ఎదుట తమ గోడు వెళ్ళబోసుకున్నారు. కూలి నాలి చేస్తూ రూపాయి రూపాయి కూడేసి చిట్టీలు కట్టామని, సైదిరెడ్డి ఇలా మోసం చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడిపై తగిన చర్యలు తీసుకొని తమ డబ్బులు ఇప్పించాలంటూవేడుకుంటున్నారు.
చిట్టీల పేరుతో అమాయకులకు శఠగోపం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES