నవతెలంగాణ – అమరావతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని టీటీడీ పంపిణీ చేస్తోందని సమాచారం.