నవతెలంగాణ – కంఠేశ్వర్ : హైదరాబాద్ ఒక ప్రయివేట్ హోటల్ (కత్రియా)లో జరిగిన ట్రినిటీ మిడ్ కాన్ఫరెన్స్ 2025 లో జేసీఐ ఇండియా జోన్ 12 , రీజియన్- బి ఉపాధ్యక్షులు దిలీప్ మల్లా వివిధ క్యటగిరుల్లో ఉత్తమ అత్యుత్తమ అవార్డు లు జేసీఐ ఇందూర్ కు అందచేశారు. 2025 జెసిఐ రైస్ అప్ అవార్డ్, నేషనల్ ఫ్లాగ్షిప్ (నేషనల్ ఫ్లాగ్ షిప్) అవార్డ్, ఉత్తమ రిపోర్టింగ్, ఉత్తమ అధ్యక్షురాలు గౌతమి, ఉత్తమ కార్యదర్శి జైపాల్, ఉత్తమ మహిళా సభ్యురాలుగా తేజస్వి , నూతన సభ్యుడు యశ్వంత్,తో పాటు వివిధ కార్యక్రమాలకు గాను అవార్డ్స్ లభించాయి. ఉత్తమ జోన్ అధికారి గా నయన్ కు జోన్ 12, రీజియన్ – ఏ ఉపాధ్యక్షుల సంకీత్ జైన్ స్పెషల్ అవార్డ్ అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో రీజియన్ సి ఉపాధ్యక్షులు వేణుగోపాల్ , ఇందూర్ సభ్యులు నిపున్, చేకృత్, మధు, పాల్గొన్నారు.
జేసీఐ ఇందూర్ కు అవార్డుల పంట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES