నవతెలంగాణ హైదరాబాద్: యుఎఇలోని షార్జా ప్రభుత్వ షార్జా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్ (సైఫ్ జోన్) సహకారంతో ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) హైదరాబాద్ లో “యుఎఇ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో మీ వ్యాపారాన్ని విస్తరించండి” పేరిట ప్రత్యేక బి2బి సమావేశాల శ్రేణిని నిర్వహించనుంది.
ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. వీటిలో రెండు రోజుల పాటు అంటే, 2025 జూన్ 26, 28తేదీ, జూన్ 27 వ తేదీన ఇంటరాక్టివ్ సెషన్ జరుగనుంది. ఈ మూడు రోజుల కార్యక్రమం హోటల్ ఐటిసి కాకతీయ హోటల్ లో జరుగనుంది. ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన , ఖర్చుతో కూడుకున్న ఫ్రీ జోన్లలో ఒకటైన సైఫ్ జోన్లో ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, యుఏఈ, విస్తృత మధ్యప్రాచ్య ప్రాంతంలో ఎగుమతి , పెట్టుబడి అవకాశాలను అన్వేషించడంలో భారతీయ కంపెనీలకు సహాయం చేయడం దీని లక్ష్యం.
యుఏఈకి ఎగుమతి అయ్యే 97% కంటే ఎక్కువ భారతీయ వస్తువులకు సుంకం లేకుండా ఎగుమతి చేసే అవకాశాన్ని అందించే ఇండియా-యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)ను ఎలా ఉపయోగించుకోవాలో ఈ సదస్సు లో పాల్గొనేవారు తగిన పరిజ్ఙానం పొందుతారు.
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ , గజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి వి రామరాజు మాట్లాడుతూ “ఈ కార్యక్రమం తెలంగాణ ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే అవకాశం కల్పించటానికి ఆచరణాత్మక వేదికను అందిస్తుంది. యుఏఈ, ముఖ్యంగా సైఫ్ జోన్, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న భారతీయ సంస్థలకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది” అని అన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనడం ఉచితం,కానీ పరిమిత స్లాట్ల కారణంగా ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ , మీటింగ్ స్లాట్ నిర్ధారణ కోసం, దయచేసి సంప్రదించండి: కె ఎన్ చంద్ర శేఖర్ రావు,ఈ మెయిల్ః :k.rao@ficci.com,మొబైల్: 9818255944