నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అనారోగ్యంతో ఆస్పత్రి పాలై బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వరంగల్ జిల్లా, నల్లబెల్లి డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నాకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అండగా నిలిచింది. జేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాకతో కలిసి సోమవారం ఆస్పత్రిలో డిప్యూటీ తహశీల్దార్ను పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. 25రోజుల చికిత్సకు గాను ఆస్పత్రికి రూ.13లక్షలు చెల్లించినా ఇంకా రూ.7లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం తెగేసి చెప్పింది. దాంతో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బిల్లును సెటిల్ చేసి, రాజేశ్ ఖన్నాను డిశ్చార్జి చేయడంలో వారు తోడ్పడ్డారు.
డిప్యూటీ తహశీల్దార్కు అండగా ఉద్యోగ జేఏసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES