- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములు సేకరించి,యువతకు ఉపాది కల్పించాలని మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1 ఉపరితల గని బొగ్గు రవాణా చేసే లారీలను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు. ఇళ్ల సేకరణలో జెన్కో అధికారులు జాప్యం చేయడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసిపిలో వేసే బాంబుల శబ్ధంతో వేగలేకపోతున్నామని, తక్షణమే ఇళ్లకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు రాజ్ కుమార్, ఓదెలు, అరుణ్, చిరంజీవి పాల్గొన్నారు.
- Advertisement -