Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎట్టకేలకు కమ్మర్ పల్లిలో కురిసిన వర్షం 

ఎట్టకేలకు కమ్మర్ పల్లిలో కురిసిన వర్షం 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతులకు ఎంతో ఊరాటనిచ్చింది. ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు వేసుకొని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారీ వర్షం రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. బుధవారం సాయంత్రం సుమారు అరగంట పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక రైతులు దిగాలు పడ్డారు. భూమిలో వేసిన విత్తనాలు ఎక్కడ మొలకెత్తకుండా పోతాయోనని ఆందోళన చెందారు. ప్రతిరోజు వర్షం కురవాలని వాన దేవుణ్ణి వేడుకున్నారు. రైతుల మొర ఆలకించిన వరణుడు భారీ వర్షం రూపంలో కరుణించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -