నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ చేశారు. జట్టు సభ్యులను ఆయన అభినందించారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్శర్మను ప్రశంసించారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని, చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంపై హార్దిక్ పాండ్యాను అభినందించారు. అద్భుత క్యాచ్తో ఆకట్టుకున్న సూర్యకుమార్ను మెచ్చుకున్నారు. జట్టుకు దోహదపడిన ద్రవిడ్కు మోడీ అభినందనలు తెలిపారు.