Thursday, June 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకోర్‌ అర్బన్‌ రీజియన్‌పై సమగ్ర పాలసీ

కోర్‌ అర్బన్‌ రీజియన్‌పై సమగ్ర పాలసీ

- Advertisement -

25 ఏండ్ల ప్రణాళికలు సిద్ధం చేయండి
సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి నిరోధించాలి : మున్సిపల్‌ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కోర్‌ అర్బన్‌ రీజియన్‌కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలనీ, సెమీ అర్బన్‌, రూరల్‌ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెరుగుతున్న హైదరాబాద్‌ జనాభాను దృష్టిలో పెట్టుకుని వచ్చే 25 ఏండ్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్‌ నగరం లో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారు లకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో మున్సిపల్‌ అడ్మినిస్టేషన్‌, అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల పనుల ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అనంతరం సీఎం మాటా ్లడుతూ…అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరంగా పూర్తిచేయాలని ఆదేశించా రు. నగరంలో శానిటేషన్‌ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దనీ, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. వానాకాలంలో డ్రెయినేజీ ఓవర్‌ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకో వాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, డ్రెయినేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్‌ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్‌ రాజ్‌, హెచ్‌ఎండీఏ పరిధిలోని ఎమ్‌ఏయూడీ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ. కర్ణన్‌, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ కె. శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎమ్‌డీ అశోక్‌ రెడ్డి, ఎమ్‌ఆర్‌డీసీఎల్‌ ఎమ్‌డీ ఈవీ నర్సిం హారెడ్డి, మెట్రో ఎమ్‌డీ ఎన్వీఎస్‌.రెడ్డి, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -