– రావల్సిన సొమ్ము రూ.22,782.50 కోట్లు : ‘కాగ్’
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ,22,782.50 కోట్లు రావాలి. గడచిన రెండు నెలల్లో కేవలం రూ. 86.73 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ లెక్కల్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నెల వారీ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది రెవెన్యూ రశీదుల అంచనా రూ.2,29,720.62 కాగా, మే వరకు రూ.23,425.68 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది వచ్చాయి. గతేడాది మొత్తంగా 10.20 శాతం నమోదు కాగా, ఈ ఏడాది 0.26 శాతానికి తగ్గింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల రూపంలో రూ.18,384.19 కోట్లు రావాల్సి ఉండగా, రూ2,192.62 కోట్ల రాబడి వచ్చింది. అలాగే రాష్ట్ర పన్నుల రాబడి అంచనా 1,75,319.35 కోట్లు కాగా, మే వరకు 22,609.02 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతేడాదితో పోలిస్తే 0.74 శాతం అదాయం తగ్గింది. రాష్ట్ర అప్పులు అంచనాల కంటే పెరిగాయని ‘కాగ్’ తెలిపింది. మే వరకు బాండ్లు, ఇతర రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం 9,389.90 కోట్ల అప్పులు చేసిందని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 2.46 శాతం అదనంగా అప్పులు చేసిందని తెలిపింది.
కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.86.73 కోట్లే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES