– బీజేపీ ఎంపీ రఘునందన్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ రోజుకో కొత్త కథతో ముందుకొస్తున్నదని బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్రావు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పథకాలకు ఎప్పుడు కూడా వ్యక్తుల పేర్లు పెట్టలేదని చెప్పారు. ఇందిరమ్మ పేరు చెబితేనే చీకటి రోజులు గుర్తొస్తాయని కూడా కాంగ్రెస్ నేతలకు అవగాహన లేకుండా పోయిందని విమర్శించారు. జీహెచ్ఎంసీలో తాగునీటి, డ్రెయినేజీ సమస్యలు తీవ్రరూపం దాల్చాయనీ, కొత్త కాలనీల్లో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని తెలిపారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్త రేషన్కార్డులు, కొత్త పెన్షన్లు లేవన్నారు. ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామ సభ పెట్టి ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు వచ్చాయా? లేదా? అనే దాన్ని తేల్చుదామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ గురైందని డీజీపీకి ఫిర్యాదు చేసినా సిట్ ఎందుకు విచారణకు పిలవడం లేదని ప్రశ్నించారు. అప్పుడున్న డీజీ, ప్రభుత్వ పెద్దలు చెప్తే ఫోన్లు ట్యాపింగ్ చేయించామని ప్రభాకర్రావు చెబుతున్నారనీ, అదే రాసి ఎందుకు రిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మిలాఖత్ అయ్యి ప్రజలను ఆగం చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల తనకు బెదిరింపు కాల్ రావడంపై డీజీపీ, సంగారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశాననీ, నార్సింగ్ ఎస్హెచ్ఓకు కంప్లెంట్ ఇచ్చానని తెలిపారు. తాము ప్రజల్ని పాలించటానికి కాదు, సేవ చేయడానికి వచ్చామనీ, ఎవ్వరికీ భయపడబోమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అవసరమున్నప్పుడే జై తెలంగాణ గుర్తుకొస్తుందని దెప్పిపొడిచారు.
హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES