- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని చిన్నగుల్లా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎంపీడీవో శ్రీనివాస్ ముగ్గు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని పలు గ్రామాలలో సొంత ఇంటి స్థలాలు ఉన్న లబ్ధిదారులకు ముగ్గు వేసి ఇంటి నిర్మాణాలను శనివారం ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా మండలానికి అన్ని గ్రామాలు కలిపి మొత్తం 6 వందల 24 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో భాగంగా చిన్నగుల్లాకు ఆరు ఇండ్లను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. ఈ గృహాలు త్వరగా చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -