Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లకు ఉపాధ్యాయుడి కృషి

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లకు ఉపాధ్యాయుడి కృషి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల అడ్మిషన్స్ ఘననీయంగా పెరిగాయి. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్క్ అడ్జస్ట్మెంట్ లో పాఠశాలకు మరో ఉపాధ్యాయున్ని కేటాయించాలని తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే..గత విద్యాసంవత్సరం చివరి రోజు నాటి ఎంపీపీ ఎస్ దోస్త్ పల్లి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలం 11గా ఉంది. అందులో ఇద్దరు విద్యార్థులు ఐదవ తరగతి పూర్తి చేసుకొని, ఒక విద్యార్థిని గురుకుల సీటు రావడంతో పాఠశాల నుండి టీసి తీసుకొని వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

అంటే పాఠశాల విద్యార్థుల సంఖ్య  కేవలం 8కి పడిపోయే స్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 6 నుండి పాఠశాల ఏకోపాధ్యాయుడైన వి. శంకర్ ఉదయం 7 గంటల నుండి 11గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు గ్రామంలోని తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉన్న సమయంలో ఇంటింటికి తిరిగి పాఠశాలలో  కల్పిస్తున్న సౌకర్యాల గురించి, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, ఆంగ్ల మద్యమంలో బోధన లాంటి అంశాలను గురించి వివరించారు.

ఈ క్రమంలో పాఠశాలలో అందుతున్న గుణాత్మక విద్యా పట్ల గ్రామంలోని ప్రజలకు యే మాత్రం అవగాహన లేదని భావించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. శంకర్ గ్రామ పెద్దలతో మాట్లాడారు. అనంతరం వారి సహకారంతో గ్రామంలో దండోరా వేయించి, గ్రామ ప్రజలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జూన్ 8 తేదీ రాత్రి 8.30 నిమిషాలకు గ్రామంలోని ప్రజలతో ఉపాధ్యాయుడు సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పనులలో భాగంగా గత సంవత్సరమే అన్ని తరగతి గదులలో లైట్స్, ఫాన్స్, అలాగే తాగడానికి మంచి నీరు, విద్యార్థులకు టాయిలెట్స్ లో మైనర్ రేపైర్స్ చేసిన విషయం అందులో రన్నింగ్ వాటర్ సౌకర్యంకల్పించిన విషయం అందుకోసం విద్యాశాఖ అందించిన తొడ్పాటు గురించి వివరించి చెప్పారు.

ఆ తర్వాత పాఠశాలలో ఆంగ్ల మధ్యమ బోధన, గత మూడు సంవత్సరాలుగా  కనీసం ఒక్కరికి గురుకుల సీటు సాధింస్తున్న విషయం గుర్తు చేశారు. విద్యాశాఖ ప్రత్యేకంగా వర్కబుక్స్ అందిస్తున్న విషయం కూడ చెప్పి అన్ని అంశాల పట్ల గ్రామ ప్రజలలో అవగాహన కల్పించి, తల్లిదండ్రులు నిర్భయంగా వారి వారి పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే  చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ వహిస్తూ వారి పిల్లల కనీస అభ్యాసన సామర్ధ్యల ప్రగతిని ఆశించిన మేరకు సకాలంలో సాధించేలా అనుక్షణం ఉపాధ్యాయులు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఇంత కృషి చేసినందుకు ఫలితంగా పాఠశాల ప్రారంభం నాటికి పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 21కి పెరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగి, నేటికకి పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 29గా ఉంది. పాఠశాల ప్రారంభం అయినా తర్వాత జూన్ 13 రోజున పాఠశాలలో అక్షరాభ్యాసం ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, జడ్పిహెచ్ఎస్ జుక్కల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మాంతరెడ్డి హాజరు అయ్యారు. కార్యక్రమం అనంతరం పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాలలోని ప్రతి విద్యార్ధికి నోటుబుక్స్, పెన్స్, పెన్సిల్స్, చిన్న తరగతులకు పలకలు, బలపం ఉచితంగా ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ చేతుల మీదుగా అందించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయునికి కాంప్లెక్స్ హెచ్ఎం,ఎంఈఓ చేతుల మీదుగా అభినందన, సన్మానించడం జరిగింది.

మా పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచడంలో సహకరించిన గ్రామ పెద్దలు పాండురంగ పటేల్, నాందేవ్ పటేల్, దత్తు పటేల్, మారొతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులకు  ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ వెంటనే అందించి మా పాఠశాలకు సహరిస్తున్న మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు ఉపాధ్యాయుడు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -