నవతెలంగాణ – గురుగ్రామ్: సంవత్సరాలుగా, ప్రజలకు నిజంగా అవసరమైనది ఏమిటో, అది దృష్టిలో పెట్టుకునే తమ పరికరాలను సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ రూపొందించింది. అంటే మెరుగైన పనితీరు, స్పష్టమైన చిత్రాలను ఒడిసిపట్టే కెమెరాలు , అనుసంధానించబడటానికి తెలివైన మార్గాలు వాటిలో భాగంగా ఉంటాయి. పరికరాలు ఏమి చేయగలవో దానికి మించి , ప్రజలు వాటితో ఎలా సంభాషించగలరనే దాని గురించి గెలాక్సీ ఏఐ ఉంటుంది.
ఏఐ వేగంగా కొత్త వినియోగదారు ఇంటర్ఫేస్గా మారుతున్నందున, ఇది సాంకేతికతతో మన సంబంధాన్ని పునర్నిర్వచించుకుంటోంది. ఇకపై యాప్లు మరియు సాధనాల సమాహారంగా మాత్రమే కాదు, వినియోగదారు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని వాస్తవ సమయంలో స్పందించే స్మార్ట్ సహచరుడిగా స్మార్ట్ఫోన్ అభివృద్ధి చెందుతోంది. ఈ పరివర్తన మనల్ని స్పందన నుండి ఆపేక్ష కు తరలిస్తుంది . ఇక్కడ, ఏఐ యుఐ గా మారినప్పుడు, ఉద్దేశ్యం తక్షణమే కనిపిస్తుంది.
తదుపరి తరం గెలాక్సీ పరికరాలు కొత్త ఏఐ -ఆధారిత ఇంటర్ఫేస్ చుట్టూ రూపొందించబడుతున్నాయి , వాటి పూర్తి సామర్థ్యాన్ని తెరవటానికి హార్డ్వేర్ మద్దతు ఇవ్వబడుతుంది. ఈ భవిష్యత్తు ఇప్పటికే కనిపిస్తోంది, గెలాక్సీ ఏఐ యొక్క అత్యుత్తమత , సామ్సంగ్ నైపుణ్యం ఆవిష్కరించబడబోతున్నాయి.