నవతెలంగాణ-కాప్రా
ఉప్పల్ నియోజకవర్గ స్థాయి ముదిరాజుల ఆత్మీయ వనభోజన సమ్మేళన కార్యక్రమం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని డివిజన్ల నుంచి ముదిరాజులు భారీ ఎత్తున హాజరయ్యారు. ముది రాజ్ సంఘం నాయకులు పలు అభ్యర్ధనలు బొంతు రామ్మోహన్కు తెలియజేశారు. రామ్మోహన్ మాట్లాడుతూ ముదిరాజ్ లు ఐక్యమత్యంతో ఉండాలని, సంఘటితం అవ్వా లని కోరారు. ముదిరాజ్ మహిళలకు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారికి అభినందనలు తెలియజేశారు. ముదిరాజ్ నాయకులు అడిగిన అభ్యర్థనలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సమ్మేళనానికి విచ్చేసిన సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలియజే శారు.పదవి ఉన్నా లేకపోయినా ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ ప్రజలకి కావాల్సిన అవసరా లకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లు శ్రీదేవి యాదవ్ ,స్వర్ణ రాజు ,బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్ , మాజీ కార్పొరేటర్లు గొల్లురి అంజయ్య ,గంధం జ్యోత్స్న నాగేశ్వర్ రావు , అనల హన్మంతు రెడ్డి , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నందికొండ శ్రీనివాస్ ,ముదిరాజ్ సంఘం పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.