నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కాకనాడ్లోని స్మార్ట్సిటీలో లులు గ్రూప్ అభివృద్ధి చేసిన లులు ఐటి ట్విన్ టవర్స్ను ఆయన ప్రారంభించారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ ఐటి కాంప్లెక్స్లో ఒక్కొక్కటి 30 అంతస్తులతో రెండు ఒకేలాంటి టవర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ ఇన్ఫోపార్క్ ఫేజ్-2 విస్తరణలో ఐటి టవర్ను ఏర్పాటు చేయడానికి లులు గ్రూప్ రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికిపైగా నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ మాట్లాడుతూ, ఈ జంట టవర్ల ప్రాజెక్ట్ ప్రపంచ ఐటి రంగంలో కేరళ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ఎం.ఎ. మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ కేరళలోని యువతకు ప్రొఫెషనల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. మూడున్నర ఎకరాల్లో తొమ్మిదిన్నర లక్షల చదరపు అడుగులతో ఐటి టవర్ తరహాలో నిర్మిస్తామని తెలిపారు.