Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జానపద కళాకారుల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్

జానపద కళాకారుల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్

- Advertisement -

పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని పిఎన్ఎం జిల్లా కార్యదర్శి  ఈర్లపల్లి  ముత్యాలు అన్నారు. ఆదివారం రోజునా భువనగిరి మండల మహాసభ తీరందాసు గోపి మీటింగ్ హాల్ నందు  ప్రజానాట్యమండలి మొదటి మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలు, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కళాకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కళాకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చి నెలకు 5వేల,రూపాయలు పింఛను ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు  మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

 లేనియెడల జులై ఆఖరి మాసంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి జానపద వృత్తి కళాకారు కళాకారులైనటువంటి చందు, యక్షగానం, కోలాటం, బాగోతం, భజన కళాకారులకు, ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లేనియెడల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు కాలుకు గజ్జ కట్టి చేత డప్పు పట్టి  భుజాన  గొంగడి వేసి  పాలకుల విధానాలను ఆటపాటల ద్వారా కళాకారులను సమీకరించి ప్రభుత్వ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో    జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ పాల్గొన్నారు.  అనంతరం నూతన ప్రజానాట్యమండలి  కన్వీనర్ గా బొల్లెపల్లి ప్రవీణ్ కుమార్, కో కన్వీనర్ గా కొల్లూరు శ్రావణి, కమిటీ సభ్యులుగా బండారి మనిషా, కొన్ని గణేష్, రాజబోయిన రవి, రాజు పాశం శ్రీను ఎన్నికైనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -