నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని మారుమూల గ్రామాలైన మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతవాసులు క్రీడారాంగంలో పలువురు విద్యార్థులు క్రీడారంగంలో ఆణిముత్యాలుగా మెరుస్తున్నాడు. జుక్కల్ మండలానికి సరిహద్దు మండలం మద్నూర్ సోమూర్ ప్రాంతంలో మౌంటెన్ స్కూల్ స్థాపించారు. జూన్ 28వ తేదీ శనివారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అథ్లెటిక్స్ సెలక్షన్లో చండేగావ్ గ్రామానికి చెందిన జోయ , అంతపూర్ గ్రామానికి చెందిన గణేష్ , రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా అంతాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ , శివరాజ్ అంగర్గ గ్రామానికి చెందిన విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలో బహుమతులు పొందారు.
వీరందరికీ పాఠశాల డైరెక్టర్ కత్తే వార్ కాశీనాథ్ పటేల్ , ఉమాకాంత్ సార్ , పాఠశాల ప్రిన్సిపాల్ మాధవరావు, , పీఈటి వెంకట్ , పాఠశాల ఉపాధ్యాయినిని , ఉపాధ్యాయులు , మేనేజ్మెంట్ బృందం వారు అభినందించారు. రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన మారుమూల గ్రామాల పేద అద్లేట్స్ విద్యార్థులు జులై ఆరవ తేదీన వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో పాల్గొన్నారు . మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు గ్రామాలైన జుక్కల్ ప్రాంత వాసులు మట్టిలో మాణిక్యాలు అనే విధంగా వారి నైపుణ్యాన్ని గుర్తించిన పి ఈ టి నిత్యం వారిచే కసరత్తు చేయించి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించేందుకు దోహద పాఠశాల ఉపాధ్యాయుల బృందం పీటి వెంకట్ ను పాఠశాల మేనేజ్మెంట్ బృందం కొనియాడారు . రాబోయే రోజులలో గ్రామీణ ప్రాంతా క్రీడలకు ప్రాధాన్యత లభించే విధంగా కష్టపడి వారి నైపుణ్యాన్ని గుర్తించి వివిధ క్రీడా రంగాలలో వారిచే ప్రాక్టీస్ చేయించి మరి కొంతమందికి రాష్ట్రస్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా పోటీలో పాల్గొనేందుకు కృషి చేస్తానని వీటి తెలిపారు.