Tuesday, July 1, 2025
E-PAPER
Homeనల్లగొండమారని తీరు.. అందని భగీరథ నీరు..!

మారని తీరు.. అందని భగీరథ నీరు..!

- Advertisement -


-10 నిముషాలకూడా రాని తాగు నీళ్లు
-అల్లాడుతున్న ప్రజలు
-తరచూ పగులుతున్న పైపులైన్లు
-నవతెలంగాణ-పెద్దవూర
మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్య గ్రామాలను  వీడేలా కనిపించడం లేదు.గతంలో కూడా భగీరథ నీరు సక్రమంగా రాక పలు గ్రామాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో గ్రామస్థులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు సమస్యను పరిష్కరించినా మళ్లీ సమస్య పునరావృతమైంది. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి కుటుంబానికి రోజుకి 100 లీటర్ల చొప్పున నీటిని అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన రోజుకు10 లీటర్లు నీళ్లు కూడా రావడం లేదు. పైపు లైన్లు మరమ్మ త్తులు గురికావడం తో వేసవి కాలం లో గ్రామాలకు తాగు నీళ్లు సరఫరా సక్రమంగా సరఫరా కాలేదు.మండలం లోనినాయినవానికుంట, నాయినవానికుంట
జయరాంతండా,పాల్తీతండా,ఏనేమీదితండా,గ్రామం లో గత ఐదు రోజులుగా 10  నిముషాలు కూడా భగీరధ నీళ్లు రావడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తరచూ పైపు లైన్లు పగలడం,లీక్ కావడం జరుగుతుంది.కొన్ని గ్రామాల్లో మిషన్ భగీ రధ పైవు లైన్ల కు చిన్నచిన్న మోటార్లు బిగించి అనీటిని వారు తమ ఇండ్ల పైవున్న ట్యాంకు లకు పంపించు కుంటున్నట్లు సమాచారం.దాంతో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఆన్ చేయగానే భగీరధ పైపు లైన్లకు అమర్చుకున్న మోటార్లు ఆన్ చేయడం తో ఓకే సారి ట్యాంక్ లో నీళ్ళన్ని అయిపొతున్నాయి.దాంతో మిగితా ఇండ్లకు తాగు నీళ్లు రావడం లేదు.ఇంకా చాలామంది మిషన్ భగీరధ పైవు ఫిట్టింగ్ వద్ద కంట్రోలు చేసే గోళీ తీసేసారు.దాంతో నాయిన వానికుంట గ్రామంలో ట్యాంక్ పక్కనే వున్నా ఇండ్లకు నీళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి.ఈ విషయమై సంబందిత అధికారులకు విన్న వించినా ఎలాంటి చర్యలు తీసుకో లేదు.అంతేగాక  గత ఐదు రోజులుగా మిషన్ భగీరధ నీళ్లు 10 నిముషాల సేపు వస్తుండడం తో ఇబ్బందులు పడుతున్నారు.భగీరథ నీరు రాకపోతే కష్టాల తప్పవని వాపోతున్నారు. భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని,అలాగే మిషన్ భగీ రధ నీటి పైలకు మోటార్లు బిగించిన వారి మోటార్లు తొలగించాలని ప్రజలు కోరుకుంటూ న్నారు.మోటార్లు బిగించిన విషయం సంబంధిత వాటర్ లైన్ మెన్లకు తెలిసిన పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.అంతేగాక నిబంధనలు ఉల్లంగించి కంట్రోల్ గోళీ తీసేసిన వారి వివరాలు కూడా వాటర్ లైన్ మెన్ లకు తెలుసు అయినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నట్లు సమాచారం.ఇప్పుటి కైన సంబంధిత అధికారులు వీటన్నిటిని పరిశీలించి భగీరధ నీళ్లు అందరికివచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

-పరిశీలించి చర్యలు తీసుకుంటాం-మిషన్ భగీరధ ఏఈ-గోపీ కృష్ణ

ఆ లైన్ పరిధిలోని నాయినవానికుంట,నాయిన
వానికుంట తండా ఇంకా గ్రామాలలోని మిషన్ భగీధ
నీటి సరఫరా తీరును  ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ  దీక్షిత్ కుమార్ తో కలిసి పరిశీలిస్తాము.మోటార్లు పెట్టినట్లు కనిపిస్తే వారికి మొదటిసారిగా వార్నింగ్ ఇచ్చి మోటార్లు.తీసేపిస్తాము.తాగునిటీ సమస్యలు తలత్త కుండా సూస్తాము. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -