నవతెలంగాణ – భిక్కనూర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తువుల తయారీ బాధ్యతలను ఐకెపి మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజా గంగారెడ్డి సోమవారం ఏకరూప దుస్తుల క్లాత్ ను ఐకెపి ఏపీఎం శ్రీనివాస్కు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులకు దుస్తులను ఐకెపి మహిళా సంఘాల ద్వారా తయారు చేసి ఇవ్వాలని పాఠశాల ప్రారంభం కాగానే విద్యార్థులకు దుస్తులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి ఈశ్వర్, మహేందర్, సి ఓ సంపత్, ఐకెపి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -