- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన చెట్టుకూరి మేధ 10వ తరగతిలో 581 మార్కులు సాధించి, బాసర త్రిబుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. దీంతో విద్యార్థిని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు బాలిక తలిదండ్రులను, బాలికను సోమవారం అభినందించారు.
- Advertisement -