Tuesday, April 28, 2026
E-PAPER
HomeNewsకిశోర బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ…

కిశోర బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం కవ్వాల్ హాస్టల్ తండ   పంచాయతీలో మంగళవారం అంగన్వాడీ కేంద్రం ద్వారా 11 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న కిశోర బాలికలకు శానిటరీ పాడ్స్ పంపిణీ చేశారు. కిశోర బాలికలు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ వజ్ర సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రతి మహిళకు 6 పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అంజయ్య, పెసా మొబలైజర్ సీడం ఖాళీ, మాజీ ఎంపీటీసీ తుడుం సౌజన్య పవన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రమేష్ శ్రావణ్ నవనీత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -