సీసీఐ సాధన కమిటీ సభ్యులు
త్వరలో రాష్ట్ర మంత్రితో భేటి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఢిల్లీలో సమావేశమై ఆదిలాబాద్ లో సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం పట్ల సానుకూలంగా స్పందించడాన్ని సీసీఐ సాధన కమిటీ స్వాగతిస్తుందని, అభినందిస్తుందని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ తెలిపారు. గురువారం సుందరయ్య భవనంలో విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీసీఐ సాధన కమిటీ ప్రతినిధి బృందం ఏప్రిల్ నెలలో ఢిల్లీకి పయనమై కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశామన్నారు.
ఆరు నెలల్లో సీసీఐ పరిశ్రమ పునః ప్రారంభానికి సంబందించిన ప్రక్రియను ప్రారంభిస్తామని హామీఇచ్చినట్టు తెలిపారు. హామినిచ్చినట్లుగానే చర్యలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. సీసీఐ పునః ప్రారంభం కోసం సీసీఐ సాధన కమిటీ గత మూడు ఏండ్లుగా నిర్విరామంగా పోరాడుతున్నామన్నారు. ఆ పోరాట ఫలితమే నేటి కదలిక అన్నారు. జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే సీసీఐ పునః ప్రారంభం ప్రక్రియలో సానుకూల పాత్రను పోషించాలని విజ్ఞప్తి చేశారు. సీసీఐ ప్రారభమైతే జిల్లా పారిశ్రామికంగా ఒక ముందడుగు వేసినట్టు అవుతుందన్నారు. జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. సీసీఐ పునఃప్రారంభం అయ్యేంత వరకు జిల్లా ప్రజల సహాకరంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఎంమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను కలువనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సాధన కమిటీ నాయకులు కొండ రమేష్, లోకరీ పోశెట్టి, బండి దత్తాత్రి, జగన్ సింగ్, అన్నమొల్ల కిరణ్, ఈశ్వర్ దాస్, విట్టల్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ సీసీఐ పునఃప్రారంభం అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES