Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం23 నుంచి పీఈసెట్‌ కౌన్సెలింగ్‌

23 నుంచి పీఈసెట్‌ కౌన్సెలింగ్‌

- Advertisement -


– షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో పీఈసెట్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, వైస్‌ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఎడ్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పీఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 14న పీఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ నెల 23 నుంచి ఈనెల 29 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనీ, ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని కోరారు. ఎన్‌సీసీ, సీఏపీ, వికలాంగులు, స్పోర్ట్స్‌ అభ్యర్థులకు ఈ నెల 25,26 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివ రించారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఈనెల 30న విడుదల చేస్తా మని పేర్కొన్నారు. ఈనెల 31, వచ్చేనెల ఒకటి తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమో దుకు అవకాశముందని తెలిపారు. అదేనెల నాలుగో తేదీన పీఈసెట్‌ తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన సీట్లను కేటాయిస్తామని పేర్కొ న్నారు. అదేనెల ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లిం చాలనీ, కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. వచ్చేనెల 11 నుంచి పీఈసెట్‌ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. పూర్తి వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రజూవషవ్‌aసఎ.్‌స్త్రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -