- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సాగు కోసం మంగళవారం ఉదయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్ట్ ఏఈఈ శివకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిసరాలలో ప్రజలు ఎవరు కూడా కాలువలో దిగరాదని పశువులు, గొర్రెలను కూడా కాలువలో దించరాదని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 17.802 టి ఎం సి లకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 4.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
- Advertisement -