- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులకు పేస్కెల్ ఇవ్వాలని గత నాలుగునెలల నుండి వేతనాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గత 20 సంవత్సరాల నుండి ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వారి మ్యానిఫెస్టోలో చేర్చారని గుర్తుచేస్తూ, ఆలస్యం చేస్తూ ఉద్యోగులకు భద్రత కల్పించడం లేదనారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండమడుగు రమేష్, ప్రధానకార్యదర్శి నాగరాజు, కోశాధికారి రామచంద్రయ్య చారి, పి ఓ ఇనాయత అలీ, చంద్రశేఖర్ , చంద్రమోహన్ , శ్రీనివాస్ , హిదయత్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -