నవతెలంగాణ – కామారెడ్డి
ఎస్ పి ఆర్ పాఠశాల లో అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన రూ.20 లక్షలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలనీ, ఓపెన్ గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసిన తర్వాతనే ఫిజులు వసూలు చేయాలనీ కోరుతూ శనివారం ఎస్ఎఫ్ఐ ఈవీఎం ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యా శాఖ అధికారికి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ లు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.5000 వసూలు చేసి, గవర్నింగ్ బాడీ లేకుండానే ఫీజులు నిర్ణయించిన ఎస్ పి ఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా యజమాన్యం ఏకపక్షంగా ఫీజులను నిర్ణయించి వేలది రూపాయలను వసూలు చేస్తున్నారన్నారు. యజమాన్యం చెప్పిన షాపులోనే పుస్తకాలను కొనాలని ఒత్తిడి చేస్తూ ఎక్కువ ధరలు పుస్తకాలను అమ్ముతున్నారన్నారు. ఐఐటీ తరగతి పేరుతో అదనంగా 15 వేల నుంచి 20 వేల రూపాయలు వసూలు చేస్తూ దిశా ప్రోగ్రాం తో పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు.తల్లితండ్రులారా మీ సమక్షంలో మాత్రమే ఫిజులను నిర్ణయించాలని విద్యా హక్కు చట్టం చెపుతుంది.
వెంటనే ఓపెన్ గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసి ఫీజులను నిర్వహించాలన్నారు. అడ్మిషన్ పేరుతో వదులు చేసిన ఐదు వేల రూపాయలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలి. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్, టీంకు, స్టాలిన్, శ్యామ్, మనోజ్, సూఫీయాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES