– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం పంపించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుంటే న్యాయ పోరాటం ఎందుకు చేయడం లేదు? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 4 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదనీ, పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు అనుమతివ్వాలని జాగతి నాయకులు సెంట్రల్ జోన్ డీసీపీకి దరఖాస్తు లేఖను అందజేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న ఈ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఆమోదించకుంటే న్యాయపోరాటం చేయరెందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES