- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ మండల ఎంపిపి,కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు,తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తల్లి అయిత లక్ష్మీ బాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న పెద్దతూండ్ల,అడ్వాలపల్లి గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,అజ్మీరా రాజు నాయక్,సబ్బిడి రమణారెడ్డి గురువారం మృతురాలి కుటుంబాన్ని పరమర్షించి,సానుభూతి ప్రకటించారు.అనంతరం మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
- Advertisement -