నవతెలంగాణ – పెద్దవంగర
పీడిత ప్రజల గొంతుక ‘నవతెలంగాణ’ దినపత్రిక అని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాల నియోజకవర్గ ప్రత్యేక సంచికను ఎంపీడీవో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజల పక్షాన ప్రత్యేక కథనాలు రాస్తూ నవతెలంగాణ దిన పత్రిక తనవంతు కృషిగా ప్రజల పక్షాన క్రియాశీలక పాత్ర సమాజంలో పోషిస్తుందన్నారు. నిజాలు నిర్భయంగా రాస్తూ, అధికారులు అందిస్తున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో నవతెలంగాణ కు ప్రత్యేక స్థానం ఉంది. భాష ప్రయుక్త రాష్ట్రాల పెన్నిధిగా నవతెలంగాణ దినపత్రికను అభివర్ణించారు. రానున్న రోజుల్లో ప్రత్యేక కథనాలు, వార్తలు రాస్తూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పత్రికా యాజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రంగు లక్ష్మణ్ గౌడ్, సుంకరి ఓంకార్ పాల్గొన్నారు.
పీడిత ప్రజల గొంతుక నవతెలంగాణ: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES