– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ”ఫ్యూచర్ సిటీ”లో ”ఎలక్ట్రానిక్ సిటీ (ఈ సిటీ)ని అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన టెలికాం ఉత్పత్తుల సంస్థలైన సిరా నెట్ వర్క్స్ (తైవాన్), ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్(తెలంగాణ) ప్రతినిధులతో ఆయన శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో 5జీ నెట్ వర్క్, మల్టీ లేయర్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారని వివరించారు. ఈ వ్యాపారం భాగస్వామ్యం ద్వారా ఇండో తైవాన్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీజీఐసీసీ సీఈవో మధుసూదన్, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, సిరా నెట్వర్క్స్ ప్రతినిధులు చుయాన్, జారు భట్టాచార్య, డౌగియాస్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ నుంచి రణ్విందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్ పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీలో ఈ-సిటీ వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES