- Advertisement -
ధీరావత్ రాజేష్ నాయక్
నవతెలంగాణ – బొమ్మలరామారం
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,యూనిఫామ్, మధ్యాహ్నం భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీరావత్ రాజేష్ నాయక్ అన్నారు. మండలంలోని గోవింద్ తండా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 40వేల విలువైన సామాగ్రి పాఠశాలకు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలని, సదుపాయాలోని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
- Advertisement -