నేడు ప్రదానం చేయనున్న మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని (ఆగస్టు 19) పురస్కరించుకుని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఛాయాచిత్రాల పోటీల్లో నవతెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు కె.నరహరి తీసిన ఈ చిత్రానికి రెండో బహుమతి దక్కింది. ఈనెల ఒకటిన నిర్వహించిన నవతెలంగాణ దినపత్రిక దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా సీఎం, మంత్రి పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మధ్య నవ్వుల పువ్వులు విరిశాయి. ఆ సమయంలో నరహరి తన కెమేరాకు పని చెప్పటంతో ఈ ఆహ్లాదకరమైన చిత్రం సాక్షాత్కారమైంది. మంగళవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నరహరి బహుమతిని అందుకోనున్నారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఛాయాచిత్ర పోటీల్లో నవతెలంగాణ ఫొటో జర్నలిస్టు కె.నరహరికి రెండో బహుమతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES