- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ద్వితీయ తృతీయ బహుమతులు గెలుచుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా స్థాయిలో ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. జిల్లా స్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.
- Advertisement -