- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అన్నమయ్య జిల్లా పీలేరు వినాయక మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినాయక మండపంలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. దాంతో క్షణాల్లో మండపం పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. మండపంలో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
- Advertisement -