- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో మండల కేంద్రంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. మండల కేంద్రానికి చెందిన హబీబ్ ఇంట్లోకి వరద నీరు చేరడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలాన్ని కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఇమామ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షాయద్ పాషా పరిశీలించి విషయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు వివరించారు. ఇంట్లోకి నీరు చేరిన కుటుంబాన్ని సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి తరలించారు.
- Advertisement -