- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాల విద్యార్థినిలు ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్, బేస్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రత్యేక అధికారిని గంగామణి బుధవారం తెలిపారు. అండర్ 17 బేస్ బాల్ పోటీలలో బి గౌరీ బంగారు పతకం, అండర్ 17 సాఫ్ట్బాల్ పోటీలలో శరణ్య రజిత పథకం, అండర్ 14 సాఫ్ట్బాల్ పోటీలలో ఉషస్విని బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పథకాలు సాధించిన విద్యార్థినులను , వ్యాయమ ఉపాధ్యాయురాలు వీణ ను ఘనంగా సన్మానించినారు.
- Advertisement -