Friday, September 19, 2025
E-PAPER
Homeకరీంనగర్యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ లో భారీ చేరికలు

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ లో భారీ చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ శుక్రవారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ లో 100 మందికి పైగా వివిధ సంఘాల నుండి చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. స్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. వారికి కండువాలు  కప్పి యూనియన్ లోకి  ఆహ్వానించారు. ఈ సమావేశం ఉద్దేశించి ఎన్. స్వామి, వి. గోవర్ధన్ లు మాట్లాడుతూ 2018 లో అసిస్టెంట్ హెల్పర్ గా 2020 లో ప్రొఫెషన్ పీరియడ్ డిక్లేర్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ హెల్పర్నుండి హెల్పర్గా ప్రమోషన్ ఇవ్వాల్సింది ఉండే కానీ ఐదు సంవత్సరాల నుండి ప్రమోషన్ ఇస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు.

సెస్ చైర్మన్ మరియు మేనేజ్మెంట్ కలగజేసుకొని అసిస్టెంట్ హెల్పర్లకు హెల్పర్ గా  పదోన్నతి కల్పించాలని   వారు పేర్కొన్నారు. సమావేశ అనంతరం సెస్ చైర్మన్ ,  ఎండి కి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం చైర్మన్, ఎండి సానుకూలంగా స్పందించి అసిస్టెంట్ హెల్పర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని వారు వివరించారని పేర్కొన్నారు.యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్. పై నమ్మకం ఉంచి చేరినందుకు వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి  శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ శ్రీనివాస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు అంజనేయులు నాయకులు కొమురయ్య సిఐటియు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి , కార్యదర్శి రమణ సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -