నవతెలంగాణ – ఆర్మూర్
బాల్కొండ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ విధి నిర్వహణలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన బాల్య మిత్రుడి కుటుంబానికి పూర్వపు బాల్య మిత్రులందరు బాసటగా ఉంటామని చెబుతూ అండగా నిలిచారు. మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998 – 99 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇరగనేని ధనుంజయ్ ఈ నెల 11 న గురువారం గుండెపోటుకు గురై మృతి చందగా మరుసటి రోజు శుక్రవారం బాల్కొండలో అశ్రు నయనాల మధ్య కుటుంబ సభ్యుల, బంధువుల, అధికారుల, స్నేహితుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.కాగా ఆదివారం మృతి చెందిన బాల్య మిత్రుడు ధనుంజయ్ ఇంటికి వెళ్లి బాల్యమిత్రుడి సతీమణి శ్రీలత కి తోటి పూర్వ స్నేహితుల బృందం తలా కొంత నగదును జమ చేసి రూ.50000/- డబ్బులను అందజేసి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.
అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు క్వింటాల్ బియ్యాన్ని పూర్వ విద్యార్థులు అందజేశారు.తోటి పూర్వ విద్యార్థులు తలా కొంత జమ చేసి మృతి చెందిన బాల్యమిత్రుడి కుటుంబానికి అందజేసి ఆ డబ్బులను వారి పాప వేద గాయత్రి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాడుకోవాలని ఆ కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్రులు ఇట్టేడి మోహన్ రెడ్డి, మూడ అశోక్, రాస భూమేశ్వర్, వేల్పుల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
మృతి చెందిన బాల్యమిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES